* నేడు మార్కాపురంలో తొలిసారి సీఎం చంద్రబాబు పర్యటన.. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. మధ్యాహ్నం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు..
* నేడు పులివెందులలో రెండో రోజు జగన్ పర్యటన.. ఉదయం నందిపల్లిలో శివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న జగన్.. అనంతరం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో జగన్ ప్రజాదర్భార్..
* నేడు ఉదయం 9 గంటలకి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. క్వశ్చన్ అవర్ తో శాసన సభ ప్రారంభం..
* నేడు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసన మండలి సమావేశాలు..
* నేడు ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో ఉదయం శేష వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం పై ఊరేగనున్న నరసింహ స్వామి.. దిగువ అహోబిలంలో ఉదయం గరుడ విమానం, సాయంత్రం హనుమంత వాహనంలో దర్శనమివ్వనున్న స్వామి..
* నేడు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంటులలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
* నేడు నాగర్ కర్నూల్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కుమ్మెర జాతర ఘటనతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేటీఆర్..
* నేటి నుంచి మార్చి 18 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష.. సెట్-బీ ప్రశ్నాపత్రం ఎంపిక చేసిన అధికారులు.. పరీక్షలు రాయనున్న మొత్తం 9,97,075 మంది విద్యార్థులు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షల కేంద్రాలు ఏర్పాటు.. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచన..
* నేడు టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
