Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేటి ఉదయం 9 గంటలకి ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ..

* నేటి ఉదయం 10 గంటలకి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఏపీ శాసన మండలి సమావేశాలు..

* నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రి రాక.. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో. బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న మాధవ్.. అనంతరం బీజేపీ కార్యాలయంలో జరగనున్న పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న మాధవ్..

* నేటి నుంచి మార్చి 24 వరకు ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ఏపీవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఆదేశాలు..

* నేడు మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై విచారణ.. బెయిల్ కోసం పిటిషన్ వేసిన సుమన్ తో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ తరపు లాయర్లు..

* నేడు కలెక్టర్ దగ్గరకు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి .. ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్.. సవాలు స్వీకరించిన కాంగ్రెస్ నేతలు.. సాక్ష్యాలతో కలెక్టర్ చెంతకు వెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధం..

* నేడు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఉమా రాణి.. చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

* నేడు మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల.. ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ విడుదల.. ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్.. మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..

Exit mobile version