Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8లో భారత్ తొలి పోరు.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా..

* నేడు టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్..

* నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మధ్యాహ్నం 3: 30 గంటలకు దేవాదుల ప్రాజెక్టుకు సీఎం రేవంత్.. దేవాదుల ప్రాజెక్టను సందర్శించనున్న రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజనీర్లతో సీఎం రేవంత్ సమీక్ష..

* నేడు గంభీరావుపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పర్యటన..

* నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి..

* నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాగ్ సేవక్ సమ్మేళనంలో పాల్గొననున్న చంద్రబాబు.. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో పోస్టల్ సదస్సు.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాగ్ సేవక్ లకు అవార్డుల ప్రదానం..

* నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పర్యటన.. పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం..

* నేడు ఐదో రోజు యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు.. స్వామివారి దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు..

* నేడు చెన్నైలో కేఏ పాల్ ప్రపంచ శాంతి సభ.. రాజకీయాలకు అతీతంగా సభ జరుగుతుందన్న కేఏ పాల్..

* నేడు యూపీలోని మీరట్ లో ప్రధాని మోడీ పర్యటన.. మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. రూ. 12,930 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..

Exit mobile version