* నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం.. శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
* నేడు విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్న సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము.. 71 స్వదేశీ, విదేశీ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న ముర్ము.. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లైట్ క్వారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్.. రాష్ట్రపతి వెంట గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
* నేటితో శ్రీశైలంలో ముగియనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి అశ్వవాహనంపై ప్రత్యేక పూజలు..
* నేటి నుంచి రెండు రోజులు పాటు ఉమ్మడి కాకినాడ జిల్లాలో ఇస్రో శాస్త్రవేత్తలు పర్యటన.. గోదావరి వరదలపై అధ్యాయనం.. ప్రస్తుతం అమలు చేస్తున్న ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టంను పరిశీలించి, వరద నియంత్రణకు ప్రత్యేక టెక్నాలజీ వినియోగం గురించి తెలుసుకోనున్న టీం.. రాకెట్ ప్రయోగ కేంద్రం ప్రతిపాదనలో ఉన్న హాప్ ఐ ల్యాండ్ కూడా సందర్శించే అవకాశం..
* నేడు అన్నమయ్య జిల్లాలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు.. రాయచోటి మండలం దిండిమీదాగారిపల్లెకి చిన్నారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు..
* నేడు సాయంత్రానికి ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే.. రాహుల్ గాంధీ.. కేసీ వేణుగోపాల్ తో భేటీ.. మధ్యాహ్నం తర్వాత ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్.. రాత్రి వరకు ఢిల్లీ చేరుకోనున్న మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. రెండేళ్ల పరిపాలన, మంత్రుల మధ్య సమన్వయలోపం, పార్టీ స్థితిగతులు, నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై చర్చ..
* నేడు ఉమ్మ నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
* నేటి నుంచి MLAల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభం.. ఇవాళ దానం నాగేందర్, ఉదయం 11 గంటలకు దానం అనర్హత పిటిషన్ పై విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరపు అడ్వకేట్ వాదనలు విననున్న స్పీకర్..
* నేటి టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లు.. ఢిల్లీ వేదికగా ఉదయం 11 గంటలకి సౌతాఫ్రికా-యూఏఈ మ్యాచ్.. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్- నమీబియా ఢీ.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్..
