Waltair Railway Division: వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రత్యేక గుర్తింపు.. వాల్తేరు డివిజన్ రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Railway Division: విశాఖ – సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తోన్న విషయం విదితమే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదే కావడం విశేషం.. అయితే, అత్యధిక జనాదరణ కలిగిన రైలుగా వందే భారత్ కు గుర్తింపు లభించింది.. ఇక, అంతే కాదు.. రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్ చేసిన రైల్వే డివిజన్గా వాల్తేరు రైల్వే డివిజన్ కొత్త రికార్డు సృష్టించింది.. ఈ విషయాన్ని వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి వెల్లడించారు.. రవాణా ద్వారా 8 వేల 389 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు తెలిపారు.. ఇక, కొత్తవలస-కిరండోల్, కొత్త వలస- రాయగడ మధ్య శరవేగంగా డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి పేర్కొన్నారు.. వాల్తేర్ డివిజన్ లో 38 రైళ్లకు ఎల్ హెచిబి కోచ్ ల అనుసంధానం పూర్తి పూర్తి అయ్యిందని.. పీఎం గతి శక్తి కింద 436 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుంతని తెలిపారు వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి .
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
కాగా, తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 2023 జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇది 8వ వందే భారత్ రైలు.. ఆదివారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా 699 కిలోమీటర్ల దూరం కేవలం 8.30 గంటల్లో విశాఖ చేరుకుంటుంది. తిరిగి 20 నిమిషాల విరామం తర్వాత సికింద్రాబాద్ బయలు దేరుతుంది. ఇక, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో 14 ఏసీ ఛైర్ కార్ కోచ్లు, 2 ఎగ్జిక్యూటీవ్ ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!