AP Revenue Dept Special Chief Secretary RP Sisodia Sudden Inspection: విజయనగరం జిల్లాలోని రెవెన్యూ అధికారులతో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా సిబ్బందికి సాధారణ ఆదేశాలు ఇచ్చారు. రికార్డులను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించొందని హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లపై తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏలాంటి నిర్ణయాలు తీసుకో వద్దు అని తెలిపారు. రెవెన్యూ ఆఫీసుల దగ్గర నైట్ బీట్స్ కో పోలీసులను సంప్రదించాలని సూచనలు చేశారు. అలాగే, అసైన్డ్ భూముల రికార్డులను బయటకు తియ్యాలని రెవెన్యశాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అదేశించారు.
Read Also: Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..
ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం తహశీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పరిశీలించారు. వీటితో పాటు భోగాపురం మండలం కొత్త మరడపాలెం ఆర్ అండ్ ఆర్ కాలనీ భూ రికార్డులను సైతం తనిఖీ చేశారు. అలాగే, రైతులతో మాట్లాడి భూ క్రయ విక్రయాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్న వారి దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా, సిసోడియా పర్యటనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, ఆర్డీఓ ఎంవీ సూర్యకళ పాల్గొన్నారు.