Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు..!
- చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
- డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు..
- కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ ఫైర్..
- వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం..
- NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..?
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. వైఎస్సార్ జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం… NTR జిల్లా పేరు వెనుక విజయవాడను ఎందుకు చేర్చలేదు..? అని ప్రశ్నించారు.. కుచితమైన ఆలోచనలతో టీడీపీ వ్యవహరి స్తోంది అని దుయ్యబట్టారు.. ప్రభుత్వం సింగిల్ పాయింట్ అజెండా ఫాలో అవుతోంది.. చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు.. డస్టర్ పెట్టి తుడిస్తే చరిత్ర మాసిపోదు అని స్పష్టం చేశారు..
Read Also: Daggubati Prasad: వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది.. గాలి తరహాలో జగన్ కూడా..!
Also Read
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
- Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
- Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..
ఇక, కడపలో అధికార పార్టీ డ్రామా ఎపిసోడ్ నడిపింది అంటూ మహానాడుపై సెటైర్లు వేశారు బొత్స.. ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పుకోలేక ప్రజలను మభ్య పెట్టేందుకు తాపత్రయపడ్డారన్న ఆయన.. సొల్లు కబుర్లు, ఆత్మస్తుతి – పర నిందకు మహానాడు పరిమితం అయ్యిందన్నారు.. సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయినందుకు మహానాడు వేదికగా ఎందుకు ప్రజలకు సంజాయిషీ ఇవ్వలేదు.. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, పాసింగ్ రిమార్క్స్ తప్ప ఏడాదికాలంలో ఏం చేశారు.. పథకాలు ఎప్పుడు ఇస్తారో ఎందుకు చెప్పలేదు…? విద్యార్థులు భవిష్యత్ తో చెలగాటం ఈ ప్రభుత్వానికి న్యాయమా..? అంటూ మండిపడ్డారు.. పదో తరగతి మార్కులు రీ వెరిఫికేషన్ కోసం 16వేల 500మంది అప్లయ్ చేయడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు.. మా హయాంలో ఐదు వేల కంటే ఒక్కరు ఎక్కువగా కరెక్షన్ వచ్చినట్టు నిరూపించగలరా…? రికార్డులు చూడండి అని సవాల్ చేశారు.. మీరు సమీక్ష పెట్టండి నేను ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి పాల్గొంటాను… బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు.. పాత విధానం నుంచి ఎందుకు పక్కదారి పట్టించారు.. సమాధానం చెప్పాలని నిలదీశారు.. మహానాడులో టీడీపీ నాయకులు వాడిన భాష పట్ల అక్షేపిస్తున్నాం.. ఖండిస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?