Visakhapatnam: ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు.. ఫుడ్డే వడ్డింపు..?
- విశాఖలో రెచ్చిపోతున్న రెస్టారెంట్లు, హోటళ్లు..
- కస్టమర్లకు పాచిపోయిన ఆహారాన్ని వడ్డిస్తున్న వైనం..
- రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: విశాఖపట్నంలో రెస్టారెంట్లు, హోటళ్ల తీరు ఇప్పటికీ మారడం లేదు. అదే పాచిపోయిన ఆహారం, అదే నిల్వ ఉంచిన నాన్ వెజ్ వంటకాలను మళ్లీ మళ్లీ వేడి చేసి కస్టమర్లకు సరఫర చేస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రెస్టారెంట్లపై అధికారులు కొద్ది రోజుల క్రితం కొరడా ఝులిపించినా, వారి పద్దతిలో ఎలాంటి మార్పు రాలేదు. గత నాలుగైదు రోజుల క్రితం వండిన చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు లాంటి వంటకాలను తిరిగి వేడి చేసి ప్లేట్లలో పెట్టడం రోజువారీ పద్ధతిగా మారిపోయింది. తాజాగా విశాఖలోని ఎంవీపీలో ఉన్న “ఆహా ఏమి రుచులు” రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 85 కిలోల పాచిపోయిన ఫుడ్ దొరికింది.
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఇక, పాచిపోయిన ఫుడ్ ను అధికారులు స్వాధీనం చేసుకుని శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత రెస్టారెంట్పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, తమ కష్టార్జిత డబ్బును ఖర్చు పెట్టి తింటున్నా, నాణ్యమైన ఆహారం లభించడటం లేదని కస్టమర్లు రెస్టారెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాచిపోయిన ఆహారం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెస్టారెంట్ల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడకుండా.. అధికారులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?