Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Data Center: ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ నగరం అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ హబ్గా ఎదగనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు సీఎం చంద్రబాబు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక నమూనాలను పరిశీలించారు. ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో గూగుల్ ఈ ప్రాజెక్ట్ను చేపడుతోంది. సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఈ క్లౌడ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం జరగనుంది. అదేవిధంగా తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్తో వేలాది ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ డేటా, క్లౌడ్, ఏఐ హబ్గా అవతరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!