Atchannaidu: పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారు..
- ఎవరు వద్దన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేషే నాయకుడు- అచ్చెన్న
- డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఒకరు తీసుకునే నిర్ణయం కాదు
- ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల పెద్దలు నిర్ణయించాలి- అచ్చెన్న
- పదవులైనా, నిర్ణయాలైనా కూటమి చేస్తుంది- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు. 500 మందితో మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల పెద్దలు నిర్ణయించి అమలు చేస్తాయని అన్నారు. ఎవరు వద్దన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం మాత్రమే అని చిన్న పిల్లాడిని నిద్ర లేపి అడిగిన చాలా క్లియర్గా చెప్తాడని తెలిపారు. డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఎవరు తీసుకునేది కాదు.. పదవులైన, నిర్ణయాలైన కూటమి చేస్తుంది.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు.
Read Also: AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
ప్రజలకు సేవ చేయాలనే తపనతో లోకేష్ రాజకీయాలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రియార్టీ కార్యకర్తలే అని చెప్పిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు. 27 వేల కి.మీ సిమెట్ రోడ్లు వేశారు.. ప్రతీ కరెంట్ స్తంభానికి లైట్లతో వెలుగులు తెచ్చారు.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
2019లో దురదృష్టవశాత్తు దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కక్ష కట్టి వ్యవహరించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 30 ఏళ్ళు తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశ్యంతో మొత్తం నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ లాంటి వాళ్ళు కూడా జగన్ చర్యలకు ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనతో అప్పులు పాలై.. రోజు గడవాలంటే కష్టంగా ఉండేదని అన్నారు. 7 నెలల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?