Atchannaidu: పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారు..
- ఎవరు వద్దన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేషే నాయకుడు- అచ్చెన్న
- డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఒకరు తీసుకునే నిర్ణయం కాదు
- ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల పెద్దలు నిర్ణయించాలి- అచ్చెన్న
- పదవులైనా, నిర్ణయాలైనా కూటమి చేస్తుంది- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు. 500 మందితో మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల పెద్దలు నిర్ణయించి అమలు చేస్తాయని అన్నారు. ఎవరు వద్దన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం మాత్రమే అని చిన్న పిల్లాడిని నిద్ర లేపి అడిగిన చాలా క్లియర్గా చెప్తాడని తెలిపారు. డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఎవరు తీసుకునేది కాదు.. పదవులైన, నిర్ణయాలైన కూటమి చేస్తుంది.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు.
Read Also: AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ప్రజలకు సేవ చేయాలనే తపనతో లోకేష్ రాజకీయాలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రియార్టీ కార్యకర్తలే అని చెప్పిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు. 27 వేల కి.మీ సిమెట్ రోడ్లు వేశారు.. ప్రతీ కరెంట్ స్తంభానికి లైట్లతో వెలుగులు తెచ్చారు.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
2019లో దురదృష్టవశాత్తు దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కక్ష కట్టి వ్యవహరించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 30 ఏళ్ళు తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశ్యంతో మొత్తం నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ లాంటి వాళ్ళు కూడా జగన్ చర్యలకు ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనతో అప్పులు పాలై.. రోజు గడవాలంటే కష్టంగా ఉండేదని అన్నారు. 7 నెలల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?