Atchannaidu: పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారు..
- ఎవరు వద్దన్నా టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేషే నాయకుడు- అచ్చెన్న
- డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఒకరు తీసుకునే నిర్ణయం కాదు
- ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల పెద్దలు నిర్ణయించాలి- అచ్చెన్న
- పదవులైనా, నిర్ణయాలైనా కూటమి చేస్తుంది- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు. 500 మందితో మెగా రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అనంతరం.. 100 కేజీల భారీ కేక్ కట్ చేశారు శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏ నిర్ణయమైన ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల పెద్దలు నిర్ణయించి అమలు చేస్తాయని అన్నారు. ఎవరు వద్దన్నా.. కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం మాత్రమే అని చిన్న పిల్లాడిని నిద్ర లేపి అడిగిన చాలా క్లియర్గా చెప్తాడని తెలిపారు. డిప్యూటీ సీఎం అంశం వ్యక్తిగతంగా ఎవరు తీసుకునేది కాదు.. పదవులైన, నిర్ణయాలైన కూటమి చేస్తుంది.. ఇందులో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు.
Read Also: AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
ప్రజలకు సేవ చేయాలనే తపనతో లోకేష్ రాజకీయాలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ప్రియార్టీ కార్యకర్తలే అని చెప్పిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు. 27 వేల కి.మీ సిమెట్ రోడ్లు వేశారు.. ప్రతీ కరెంట్ స్తంభానికి లైట్లతో వెలుగులు తెచ్చారు.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Uber And Ola: “ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు వేర్వేరు ధరలు”.. ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..
2019లో దురదృష్టవశాత్తు దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కక్ష కట్టి వ్యవహరించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 30 ఏళ్ళు తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశ్యంతో మొత్తం నాశనం చేశారని దుయ్యబట్టారు. తమ లాంటి వాళ్ళు కూడా జగన్ చర్యలకు ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనతో అప్పులు పాలై.. రోజు గడవాలంటే కష్టంగా ఉండేదని అన్నారు. 7 నెలల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేశామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!