Site icon NTV Telugu

Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు

Vallabhaneni Vamshi

Vallabhaneni Vamshi

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. ఈరోజు కూడా వంశీని 20 ప్రశ్నలు పైగా సంధించారు పోలీసులు. నిన్నటి లాగే పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, సంబంధం లేదు అంటూ వంశీ సమాధానం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమా తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. మైనింగ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నాస్తాలు సంధించారు. సత్యవర్ధన్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి జైలుకు తరలించనున్నారు.

Read Also: Ramprasad Reddy: మార్చి 1, 2 తేదీలలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహిస్తాం..

వల్లభనేని వంశీని కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. కాగా, వల్లభనేని వంశీ రిమాండ్‌ను మార్చి 11వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. ఈ క్రమంలో.. వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడున్నర గంటలపాటు వంశీని విచారించారు. అనంతరం.. ఈరోజు కూడా మూడు గంటలకు పైగా వంశీని పోలీసులు విచారించారు.

Read Also: Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..

Exit mobile version