AP Liquor Scam Case: సిట్ దూకుడు.. లిక్కర్ స్కామ్ కేసులో ఇక వరుస అరెస్ట్లు..!
- ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు..
- వరుసగా కీలక వ్యక్తుల అరెస్ట్ లు..
- త్వరలో మరికొన్ని అరెస్ట్ లు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది.. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 చాణక్యను అరెస్టు చేసిన సిట్.. తాజాగా, ఏ6 శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో ఇకపై వరుసగా కేసులో అరెస్టులు ఉంటాయనే సంకేతాలు సిట్ ఇచ్చింది.. గత రెండు నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సిట్.. ఇప్పుడు ఆ కేసులో అరెస్టులపై ఫోకస్ పెట్టింది. వరుసగా కేసులో నిందితులను అరెస్టు చేయడం చూస్తే ఇకపై కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలను సిట్ ఇస్తోందని అర్థమవుతుంది. కేసులో కీలకంగా వ్యవహరించి సిట్ విచారణకు హాజరుకాకుండా మొండి కేసిన కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో అరెస్టులను మొదలు పెట్టింది. కసిరెడ్డి అరెస్టు జరిగిన రెండో రోజులకి అతని టీం లో ప్రధాన అనుచరుడుగా ఉన్న చాణిక్యను సిట్ అరెస్ట్ చేసింది..
Read Also: Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఇప్పుడు తాజాగా కసిరెడ్డికి సన్నిహితుడుగా ఉన్న ఎస్పీవై ఆగ్రోటెక్ సంస్థ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది.. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అరెస్టు చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది .. లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచింది.. కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడని లిక్కర్ సిండి కేటులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందటంతో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రగా పేర్కొంది. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అనిచివేయటంలో శ్రీధర్ రెడ్డి కీలకమని పేర్కొంది. చట్ట విరుద్ధంగా లిక్కర్
ఆర్థర్ ఫర్ సప్లై (OFS) జారీ చేశారని మద్యం తయారీ, హోల్ సేల్, రిటైల్ ను ముడుపులు తీసుకొని నియంత్రించటం శ్రీధర్ రెడ్డి చేశారని సిట్ తెలిపింది. డిస్టలరీస్ ను సమన్వయం చేసి సకాలంలో సిండికేట్ సభ్యులకు ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపింది.. కేసులో ఇతర నిందితులు వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లకు నచ్చిన కంపెనీలకు ఆర్థర్ ఫర్ సప్లై జారీ చేశారని పేర్కొంది.. ముడుపులు, కమిషన్ ద్వారా డబ్బు ఎలా సేకరించారు, ఏ కంపెనీలకు మళ్లించారు, ఆ డబ్బు ఎలా వినియోగించారు అనే వివరాలు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!