Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..
Raed Also: India-Pakistan Tensions: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. సమస్య పరిష్కారం కోసం భద్రతా మండలి కీలక భేటీ..
ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులతో, ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని సన్నిహిత సహాయకుడు దిలీప్ పైలాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి సంబంధం ఉన్న తీవ్రమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్న కేశినేని నాని.. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు మరియు ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మరియు అతని భార్య జానకీ లక్ష్మీ కేసినేనితో కలిసి Pryde Infracon LLPలో నియమిత భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, ప్లాట్ నెం. 9, సర్వే నెం. 403లో నమోదు అయ్యిందని పేర్కొన్నారు.. కేసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న Eshanvi Infra Projects Pvt. Ltd. కూడా ఇదే చిరునామాను కలిగి ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, Pryde Infracon LLP మరియు Eshanvi Infra Projects Pvt. Ltd. రెండూ ఒకే అధికారిక ఈమెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నాయి అని దుయ్యబట్టారు.. ఇది రెండు సంస్థల మధ్య సామీప్యత మాత్రమే కాకుండా, ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తుందన్నారు..
Read Also: Fire Accident : ప్యాట్నీ సెంటర్ SBI బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం.. కీలక ఫైల్స్ దగ్ధం
ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్ట్తో దర్యాప్తులో ఉండవచ్చని, ఒక సిట్టింగ్ ఎంపీతో నేరుగా సంబంధం ఉండటం రాజకీయ రక్షణ మరియు ఆర్థిక సమన్వయం గురించి తీవ్రమైన ఆందోళ కలిగిస్తోందన్నారు కేశినేని నాని.. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు విదేశీ కంపెనీలలో అక్రమంగా మళ్లించిన పెద్ద మొత్తంలో నిధులను పెట్టుబడి పెట్టారని నమ్మదగిన సమాచారం సూచిస్తోంది. ఇవి కుంభకోణంతో సంబంధం ఉన్న దేశీయ కార్యకలాపాల నుండి లెక్కలేని సంపదను లాండరింగ్ చేయడానికి మరియు నిల్వ చేయడానికి ఉపయోగించబడవచ్చు అనే అనుమానాలను లేవనెత్తారు.. మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని.. ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించాలని సీఎం చంద్రబాను కోరారు.. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం, నిందితులతో సామీప్యతను పరిశీలించకుండా వదిలివేయకూడదు. మీరు నిర్ణయాత్మకంగా చర్య తీసుకోవాలని, న్యాయాన్ని నిలబెట్టాలని.. రాజకీయ సంబంధాలు జవాబుదారీతనానికి అడ్డంకిగా నిలవకుండా చూడాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని..
