Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Left Parties Protest: వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, సీఎన్జీ ధరలు.. సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. క్రమంగా అన్ని వస్తువులపై వీటి ప్రభావం పడుతోంది.. అయితే, విజయవాడలో వామపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. లెఫ్ట్ పార్టీల ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల వల్లే ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని విమర్శించారు.
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష నేతలు వెల్లడించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా పాసర్లపూడిలోని కేజీ బేసిన్ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
సీఎం చంద్రబాబు నాయుడు రోజూ పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల పేరుతో ప్రకటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారని, కానీ ధరల పెరుగుదల వల్ల ఎంత మంది ఉపాధి కోల్పోయారో లెక్కలు చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “పొదుపు చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబులే పాటించడం లేదు” అని వ్యాఖ్యానించారు.
లోకేష్ హామీలపై ప్రశ్నలు
ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేసిన వామపక్ష నేతలు, ఇప్పుడు ఎందుకు ఆ హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించకపోవడం ఏమిటని నిలదీశారు. అంతే కాదు.. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను తక్షణమే తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే మహానాడులోనే ఇంధన ధరల తగ్గింపుపై తీర్మానం చేయాలని కోరాయి.. కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే వనరుల్లో 50 శాతం రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ ధరలను పాత ధరలకే అందించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని, వెంటనే కేంద్రం మరియు రాష్ట్రం ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి లెఫ్ట్ పార్టీలు..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!