AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి మిథున్రెడ్డి
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం..
- సిట్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి..
- ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు..
- రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.. అయితే, సిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. మిథున్రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. మిథున్ రెడ్డిని రెండు రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది..
Read Also: ఇక ప్రొఫిషనల్ కెమెరాలు అవసరం లేదేమో.. డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న Honor Magic V8 series?
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేపు అనగా సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మిథున్రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు.. రెండు రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు.. గతంలో ఎంపీ మిథున్రెడ్డిని ప్రశ్నించిన తర్వాతే సిట్ అరెస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉండగా.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మిథున్రెడ్డి నుంచి లిక్కర్ స్కాం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిద్ధమైంది సిట్ టీమ్.. కాగా, ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ గతంలో మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలంటూ కోర్టు షరతులు విధించగా.. ఆ మేరకు ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
-
Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్లో ఫుల్ బిజీగా బాబు.. అందుకోసమేనా?
-
MS Dhoni: “ధోనీ ఎక్కడ?”.. కనీసం డగౌట్లోనూ కనిపించని మిస్టర్ కూల్.. అసలు గుట్టు విప్పిన కోచ్
-
Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
-
NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!