MP Mithun Reddy: ఎంపీ మిథన్రెడ్డికి మధ్యంతర బెయిల్.. షరతులు వర్తిస్తాయి..
- ఎంపీ మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు..
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి మధ్యంతర బెయిల్..
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి..
- ఈ నెల 11న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు.. ఇదే సమయంలో.. 50 వేల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.. ఇక, ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో మళ్లీ సరెండర్ కావాలని షరతులు పెట్టింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..
Read Also: Asia Cup 2025: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. హార్దిక్ పాండ్యా న్యూ లుక్ వైరల్..
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
కాగా, ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.. జులై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. అయితే, ఓవైపు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే.. ఇంకో వైపు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎంపీ మిథున్రెడ్డి.. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.. 11న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది.. ఇక, మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో.. ఈ రోజు సాయంత్రం లోగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!