Vijayawada Adulterated Chicken: వామ్మో కుళ్ళిన మాంసం.. విజయవాడలో అధికారుల తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారులు రెచ్చిపోతున్నారు.. జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కుళ్ళిన మాంసం అమ్ముతూ జనం ప్రాణాల మీదకు తెస్తున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఇది గొంతు దిగని వార్త. బెజవాడ నాన్ వెజ్ మార్కెట్ లో కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సండే కావటంతో నాన్ వెజ్ మార్కెట్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయవాడలో వీఎంసీ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట మార్కెట్ లో తనిఖీ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర.
ఆయన తనిఖీల్లో నివ్వెర పోయే నిజాలు బయటపడ్డాయి. మాచవరం, బీఆర్టీఎస్ రోడ్డు, ప్రకాష్ నగర్ లోని మార్కెట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మాచవరంలో 5కేజీల కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు వీఎంసీ అధికారులు. వారం వారం ఇలాంటి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతూనే వున్నాయి. వారం క్రితం కొత్తపేట హనుమంతరాయ మార్కెట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు మాంసం దుకాణాల్లో కుళ్లిపోయిన మాంసం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
Read Also: Legionnaires Disease: అర్జెంటీనాలో లెజియోనైర్స్ వ్యాధి కలకలం.. నలుగురి మృతి
సుమారు 100 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో కేజీల కొద్దీ కుళ్ళిన మాంసం బయట పడడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు నామమాత్రంగా కాకుండా నిరంతరం కొనసాగించాలని, మాంసం దుకాణాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఫ్రిజ్ లలో నిల్వ వున్న మటన్, చికెన్ కొనుగోలు చేయవద్దని, ఖరీదు ఎక్కువైనా ఫ్రెష్ గా వున్నవాటినే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
హోల్ సేల్ మటన్ వ్యాపారులు కూడా ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు. తక్కువ ధరకు మటన్, చికెన్ విక్రయిస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మటన్ వ్యాపారస్థులు చనిపోయిన మేకలు 3 వేలకు 4 వేలకు కొనుగోలు చేసి తక్కువకు విక్రయిస్తున్నారని, ఇలాంటి వారి సమాచారం తెలిస్తే అధికారులకు అందచేయాలంటున్నారు. మొత్తం మీద మటన్, చికెన్ ప్రియులకు కొందరు కేటుగాళ్ళు టోకరా వేస్తున్నారు. కల్తీ మాంసం తిని అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Read Also: Mohammad Rizwan: వామ్మో.. భారత్తో మ్యాచ్ అంటేనే..
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!