Vijayasai Reddy: ‘రాష్ట్రానికే ఖర్మ’ అంటూ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Fires On Chandrababu Naidu Over Macherla Violence: టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలో లేకపోతే.. గుడులు, బడుల్ని సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే.. బాబు తనలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్రానికే ఖర్మ అంటూ ధ్వజమెత్తారు. మాచర్లలో జరిగిన ఘర్షణని ఉద్దేశించి.. ఈ విధంగా ట్విటర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డి స్పందించారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
Also Read
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
‘‘ఎన్నికలు సమీపిస్తుండడంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏంచేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైరవిహారం చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ! తాను అధికారంలో లేకపోతే చాలు.. గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది. తానే కక్షలు, కార్పణ్యాలు రగిల్చి.. మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం.. మన రాష్ట్రానికే ఖర్మ’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Ram Gopal Varma: ఆ సెక్స్ సినిమా నా కొడుకుతో కలిసి చూశా.. వర్మ తల్లి షాకింగ్ కామెంట్స్
అంతకుముందు కూడా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలని చూశారని.. కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. కర్నూలుకి వెళ్లి తనే రెచ్చగొట్టే యత్నం చేశారన్నారు. మీరు కడుపు మాడ్చుకొని, మాకు కమ్మని భోజనం వడ్డించండి అన్నట్టుంది చంద్రబాబు వాలకమని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏం చేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రానికి వీరేం ఖర్మ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 18, 2022
తాను అధికారంలో లేకపోతేచాలు… గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది. తానే కక్షలు కార్పణ్యాలు రగిల్చి మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు – ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికే ఖర్మ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 18, 2022
తాజావార్తలు
-
T20 World Cup: 18 ఏళ్ల కల ముక్కలైంది.. దేశానికి కప్పు అందించలేకపోయానంటూ ఏడ్చేసిన కెప్టెన్..
-
Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
-
X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
-
Tragedy: నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!