Vidadala Rajini: ఆరోగ్య రంగానికి వైఎస్సార్ పునాది వేస్తే.. జగన్ మెరుగుపరిచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini Started New 104 108 Vehicles In AP: గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 20 చొప్పున 108, 104 వాహనాలను ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య రంగానికి వైఎస్సార్ పునాది వేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ ఆ రంగాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాత్రం ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల్ని మరింత మెరుగు చేసేందుకు రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 104, 108 వాహనాల ద్వారా 25 వేల మందికి ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తామని వెల్లడించారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై విడదల రజిని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్, చంద్రబాబుల ముసుగు తొలగిపోయిందని.. విశాఖ సంఘటనను అడ్డం పెట్టుకొని ఇద్దరూ బయటపడ్డారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష దారుణంగా ఉందన్నారు. విశాఖ గర్జన విజయవంతం కావడంతో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ ఈ అలజడి సృష్టించారని మండిపడ్డారు. అలాగే.. జగన్మోహన్ రెడ్డిపై బిజెపీ నేతలు విమర్శలు చేసే ముందు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
Also Read
- YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
- Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
అంతకుముందు.. పవన్కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడని, పవన్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను నమ్ముకుంటే, కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా ఉంటుందన్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారప్పారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పయనిస్తున్నాడని విమర్శించారు. ఆ తర్వాత.. అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు, ఇప్పుడు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలనకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్నదాతలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని పేర్కొన్నారు. బాబు, కరువు.. కవల పిల్లలని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
Allu Arjun Fans Association: కష్టాల్లో ఫ్యాన్ కుటుంబానికి అండగా AAFA.. రూ.1.5 లక్షల సహాయం!
-
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!