Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaijayasai Reddy Tweet On CM Jagan PM Modi Meeting: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే! ఈ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా.. ప్రధాని మోడీతో జగన్ భేటీ సానుకూల రీతిలో ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. ఈ భేటీలో భాగంగా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారని వెల్లడించారు. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా కేంద్రం సహకారం అందించాలని సీఎం కోరినట్టు తెలిపారు.
కాగా.. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలతో పాటు ఇతర అంశాలపై సీఎం జగన్ వినతి పత్రం అందించారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేకహోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని జగన్ చెప్పారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని మోడీకి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేసిందని, కేంద్ర ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభుత్వంలో వాటిని సర్దుబాటు చేస్తోందని వివరించారు. అటు.. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.2,937 కోట్లు ఖర్చు చేసిందని, దీనికి సంబంధించిన చెల్లింపులు రెండేళ్లుగా జరగడం లేదని సీఎం వెల్లడించారు.
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
అలాగే.. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిల రావాలని, వాటిని తక్షణమే ఇప్పించాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరిందని, రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా రీత్యా మిగిలిన 12 జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో రాజకీయ పరమైన అంశాలపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సీఎం జగన్ ఈరోజు రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
Positive and Fruitful discussion for the progress of AP & it’s people, took place between Hon. PM @narendramodi ji and our CM @ysjagan garu. All issues faced by AP were highlighted for kind consideration of the Centre. pic.twitter.com/AVYkpqxjA8
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 28, 2022
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!