Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaijayasai Reddy Tweet On CM Jagan PM Modi Meeting: తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే! ఈ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా.. ప్రధాని మోడీతో జగన్ భేటీ సానుకూల రీతిలో ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు. ఈ భేటీలో భాగంగా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల్ని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లారని వెల్లడించారు. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా కేంద్రం సహకారం అందించాలని సీఎం కోరినట్టు తెలిపారు.
కాగా.. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలతో పాటు ఇతర అంశాలపై సీఎం జగన్ వినతి పత్రం అందించారు. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేకహోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని జగన్ చెప్పారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని మోడీకి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు చేసిందని, కేంద్ర ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభుత్వంలో వాటిని సర్దుబాటు చేస్తోందని వివరించారు. అటు.. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.2,937 కోట్లు ఖర్చు చేసిందని, దీనికి సంబంధించిన చెల్లింపులు రెండేళ్లుగా జరగడం లేదని సీఎం వెల్లడించారు.
Also Read
అలాగే.. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిల రావాలని, వాటిని తక్షణమే ఇప్పించాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరిందని, రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా రీత్యా మిగిలిన 12 జిల్లాలకు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. ఇదే సమయంలో రాజకీయ పరమైన అంశాలపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సీఎం జగన్ ఈరోజు రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
Positive and Fruitful discussion for the progress of AP & it’s people, took place between Hon. PM @narendramodi ji and our CM @ysjagan garu. All issues faced by AP were highlighted for kind consideration of the Centre. pic.twitter.com/AVYkpqxjA8
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 28, 2022
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..