Andhra Pradesh Crime: ప్రాణాలు తీసుకుంటున్న ప్రేమికులు.. ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్లో ఒకేరోజు రెండు ప్రేమ జంటలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఓ జంట బాపట్ల జిల్లాలు ప్రాణాలు తీసుకుంటే.. మరో జంట తిరుపతిలో ప్రాణాలు వదిలేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలో ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపింది… నగరంలో గోవింద రాజస్వామీ ఆలయ సమీపంలోని త్రిలోక రెసిడెన్షిలో ఉరివేసుకుని బలవర్మణానికి పాల్పడింది ఓ జంట.. వీరిని ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు చెందిన అనూష, హైదరాబాద్కు చెందిన కృష్ణరావులుగా గుర్తించారు పోలీసులు. నాలుగు నెలలు క్రితం అనూషకు వేరే వ్యక్తితో పెళ్లి కూడి జరిపించారు కుటుంబసభ్యులు.. కానీ, ఆ పెళ్లి ఇష్టం లేకనే తిరుపతిలో ప్రియుడుతో కలసి అనూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
Read Also: Gold and Silver Rate Today: పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్..
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. బాపట్ల జిల్లా చినగంజాం మండలం అడీవీధిపాలెం గ్రామ శివారుల్లో మరో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది.. మృతులు చినగంజాం మండలం మున్నంగివారిపాలెంకు చెందిన సుబ్బారెడ్డి(25), తేజ(18)గా పోలీసులు గుర్తించారు. మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, తేజలు గత కొంతకాలంగాప్రేమించుకుంటున్నారు. సుబ్బారెడ్డి పదోవతరగతి వరకు చదివి వ్యవసాయ కూలి పనులకు వెళ్తుండగా.. తేజ ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో ఆపేసింది. అయితే, ఇద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది.. ఇరువురి ప్రేమ వివాహనికి పెద్దలు ఆంగీకరించకపోవడంతో మనస్థాపంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. ఇక, మృతదేహాలను ఫోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మున్నంవారిపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి.. మొత్తంగా ఒకేరోజు రెండు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకోవడం ఏపీలో కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!