Site icon NTV Telugu

నేడు ప్రత్యేక దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ…

నిన్న తిరుమల శ్రీవారిని 13358 మంది భక్తులు దర్శించుకోగా 5390 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 1.08 కోట్లు గా ఉంది. అయితే ఈ నెల 19వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం కానుండగా ఈ నెల 20వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21వ తేదికి పాలకమండలి గడువు ముగియనుండగా ఈ 22 నుంచి 24వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 24వ తేదిన శ్రీవారి ఆలయంలో వర్చువల్ ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. అయితే ఇవాళ ఆన్ లైన్ లో 22,23,24వ తేదిలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ రోజుకి 5 వేల టోకేన్లు చోప్పున విడుదల చేయనుంది.

Exit mobile version