Site icon NTV Telugu

ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

corona

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,566 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,139 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,16,680కు పెరగగా… రికవరీ కేసులు 19,88,101కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,877 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 14,702 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2,67,45,035 గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Exit mobile version