AP CM: ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం
- శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- అనంతరం స్వయంగా టీ పెట్టిన ముఖ్యమంత్రి
- గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైన్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో 8 శాతం వాట AG&G సంస్థ కలిగి ఉందని అన్నారు. 80 లక్షల మందికి సురక్షితమైన గ్యాస్ అందిస్తున్నారని సీఎం వెల్లడించారు.
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి మ్యాచ్లు అంటే..?
Also Read
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్కు తేదీ ఖరారు.!
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోంది.. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వాడుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి గ్యాస్ను ఏపీకి పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయి.. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యంగా మారుతుందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ సహా ఇతర వాటి వల్ల కాలుష్యం ఎక్కువ అవుతోంది.. నేచురల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీ మునుముందు కీలకంగా మారుతాయన్నారు. గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్ల టార్గెట్ గా నూతన పాలసీని విడుదల చేశాంమని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్ కో, ఎన్టీపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారని సీఎం అన్నారు. అలాగే.. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళిక చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు
త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ హైడ్రోజన్ను విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ప్రతి ఇంటికి, పారిశ్రామిక కంపెనీలకు సిఎన్ జీ గ్యాస్ ను అందించాలని కంపెనీ కోరుతున్నానన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని తెలిపారు. తాను స్వయంగా సిఎన్ జీ గ్యాస్ ను ప్రారంభించి ఆ ఇంటిలో కాఫీ పెట్టానని చెప్పారు. ఆ కుటుంబానికి తానే స్వయంగా కాఫీ ఇచ్చాను.. సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేచురల్ గ్యాస్ తో పాటు నేచురల్ ఫుడ్ కూడా ఉండాలి.. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన AG&G సంస్థ అభినందిస్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!