Tirumala Devotees Clash: తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూ లైన్లలో పరస్పరం దాడులు.. వీడియోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Devotees Clash: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేసవి సెలవుల రద్దీ ఎఫెక్ట్ తగిలింది.. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కొంతమంది భక్తులు సహనం కోల్పోతూ పరస్పరం దాడులకు దిగుతున్నారు. నిన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో సంయమనం పాటించాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని టిటిడి అధికారులు గతంలోనే భక్తులకు సూచించారు. అయితే కొంతమంది భక్తులు టిటిడి విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం వల్ల ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Real Estate Scam: శ్రీవారి వీవీఐపీ దర్శనం పేరుతో రియల్ ఎస్టేట్ మోసం?..
- Tirumala: తొలి ఏకాదశి రద్దీతో కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 20 గంటల నిరీక్షణ..!
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
ఇక, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి పాలకమండలి సభ్యుడు సుదర్శన్ వేణు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 15వ తేదీ వరకు తన సిఫార్సు లేఖల కోటాను 50 శాతానికి తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అదనపు టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వేలాది మంది భక్తులు బయట క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 74,569 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 46,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.8 కోట్లకు చేరగా, లడ్డు ప్రసాదం విక్రయాలు 4.15 లక్షలకు నమోదయ్యాయి. మరోవైపు అన్నప్రసాద వితరణ ద్వారా సుమారు 2.7 లక్షల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించినట్లు టిటిడి వెల్లడించింది. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు సహనం పాటించాలని, టిటిడి అధికారులకు సహకరించాలని ఆలయ అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!