Janga Krishnamurthy Resignation: స్థల వివాదం..! టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janga Krishnamurthy Resignation: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యత్వానికి బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.. దీనికి ప్రధాన కారణం స్థల వివాదంగా తెలుస్తోంది… 2005లో టీటీడీ తనకు కేటాయించిన 500 గజాల స్థల వివాదమే కారణంగా చెబుతున్నారు.. 2005లో జంగా కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్లో ప్లాట్ నం.2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ.. 31 జూలై 2005న టీటీడీ బోర్డు తీర్మానం ద్వారా గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్లాట్ కేటాయించారు.. అయితే, 2006లో నిబంధనలు పాటించలేదన్న కారణంతో ప్లాట్ కేటాయింపు రద్దు చేసింది.. కానీ, 2008లో డొనేషన్ చెల్లింపుకు గడువు పెంచాలని జంగా విజ్ఞప్తి చేశారు.. జంగా కట్టిన 10 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ (DD) 2008లో టీటీడీకి చెల్లింపు కాగా.. 21 అక్టోబర్ 2008న జీవో నెం.1220 జారీ అయ్యింది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక కేసుగా పరిగణించి మళ్లీ ప్లాట్ కేటాయింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. 2009లో హైకోర్టును ఆశ్రయించారు జంగా కృష్ణమూర్తి.. 2009లో పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని 2009లో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఆ మేరకు ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో జంగాకు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
కానీ, దీనిపై విమర్శలు రావడం తో రద్దు చేయాలని నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.. అయిదే, దీనిపై జంగా కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు.. టీడీపీ పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీటీడీ చైర్మన్ కి రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారట.. తిరుమలలో స్థల కేటాయింపు వ్యవహారంపై మనస్థాపానికి గురైన ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. అయితే, జంగా రాజీనామాను ఆమోదించే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!