Heavy Rains: తిరుమలలో భారీ వర్షాలు.. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేత
- తిరుమలలో భారీ వర్షం
- టీటీడీ ముందస్తు జాగ్రత్తలు
- శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేత
- పాపవినాశనం.. శిలాతోరణం.. శ్రీవారి పాదాలు మూసివేత
- రేపు తిరుపతి.. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రైవేటు స్కూలు.. కాలేజీలకు సెలవు.
వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.
Read Also: Israel-Labnon War: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
- Tirumala Devotees Record: రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. ఏడాదిలో 2.67 కోట్ల మందికి దర్శనం..
మరోవైపు.. తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, నగరిలోని శివారు ప్రాంతాలోని ఇళ్ళలోకి వర్షపు నీరు భారీగా చేరింది. అటు.. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పలుచోట్ల కాజ్వేలపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల వల్ల ప్లాష్ ప్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సూచనలతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా.. రేపు తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రైవేటు స్కూలు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో 2500 హెక్టార్ల వరి పంట, 10 హెక్టార్ల కోత దశలోని వరి పంట, 4 హెక్టార్ల మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.
Read Also: ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. ‘స్పెషల్-20’లోకి దిగ్గజ బ్యాట్స్మెన్
మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో కూడా వర్షం భారీగా కురుస్తోంది. తుఫాన్ కారణంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. భారీ వర్షాల ధాటికి వరి, బొప్పాయి, అరటి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. రైల్వేకోడూరు, రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు, లక్కిరెడ్డిపల్లి, వీరబల్లి మండలాలలో 45 హెక్టార్లు వరి పంట దెబ్బతిన్నది. రైల్వేకోడూరు, పెనగలూరు మండలాలలో 10 ఎకరాలు బొప్పాయి, 2 ఎకరాలు అరటి, ఒక ఎకరా టమోటా పంట దెబ్బతిన్నది.
తాజావార్తలు
-
Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
-
Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
-
Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?