NTV Telugu Site icon

ఏపీ ఎంపీకి బెదిరింపులు..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి… బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌కు ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి సదరు ఎంపీపై బెదిరింపులకు దిగాడు.. దీంతో.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ… ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన తుల్లూరు పోలీసులు.. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కూలిలాగడంతో.. ఫోన్‌ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబూరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఎంపీ నందిగాం సురేష్‌తో అసలు బాబూరావుకు ఉన్న వైరం ఏంటి..? ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే విషయాలను తేల్చేపనిలోపడిపోయారు తుళ్లూరు పోలీసులు..