Andhra Pradesh RGF: కర్ణాటకలో కేజీఎఫ్.. ఆంధ్రాలో ఆర్జీఎఫ్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh RGF: కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) గురించి అందరికీ తెలుసు. కేజీఎఫ్ సినిమాతో ఈ విషయం విశ్వమంతా తెలిసింది. అయితే ఏపీలో RGF ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆర్జీఎఫ్ అంటే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ . నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం ఆర్జీఎఫ్కు తాళం పడగా.. ఇప్పుడు మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రామగిరి బంగారు గనుల కోసం టెండర్లు మెుదలయ్యాయి. ఆగస్టు నెలాఖరులో టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని రామగిరి నార్త్ బ్లాక్, సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని 10 బ్లాక్ల బంగారు గనుల కోసం భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల నుండి టెండర్లను ఆహ్వానించింది. రొద్దం మండలంలోని బొక్సంపల్లి నార్త్ ప్లాంట్, బొక్సంపల్లి సౌత్ బ్లాక్, కదిరి మండలంలోని జవకుల -ఎ, జవకుల-బి, జవకుల -సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్ లను వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదు గనులకు ఈనెల 29న వేలం నిర్వహించనున్నారు.
Read Also: Onion Prices Fall: ఉల్లి ధర పతనం.. అన్నదాతల కన్నీరు..
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
కాగా 2015లో మైనింగ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. ఈ మేరకు ఏపీలోని 10 బంగారు గానులు, ఉత్తరప్రదేశ్లో మూడు గనులను తవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బ్రిటీష్ కాలంలో రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ సంగతి బయటకు వచ్చింది. రామగిరి ఆర్పీ బ్లాక్లో 13 కి.మీ. పొడవు గల రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ (RGF) ఉన్నాయి. 1973లో రామగిరి ప్రాంతంలోని దొడ్డ బురుజు పేరుతో బంగారు నిక్షేపాలను వెలికితీసేందుకు తొలిసారి ఇక్కడ మైనింగ్ చేశారు. అప్పట్లో టన్ను మట్టిలో నుంచి 20 గ్రాముల బంగారాన్ని వెలికి తీసేవారు. 1984లో కర్నాటకలోని కోలార్ జిల్లాకు చెందిన కర్నాటక గోల్డ్ ఫీల్డ్ కంపెనీ రామగిరిలో భారత్ గోల్డ్ మైన్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడ మైనింగ్ ప్రారంభించారు. అలా ఏడాదికి 120 కిలోల బంగారం చొప్పున 17ఏళ్ల పాటు బంగారం వెలికితీశారు. ఏప్రిల్ 2001 వరకు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) RGFలో భూగర్భ గనిని నిర్వహించింది. అయితే గనుల రిటర్న్ల కంటే ఎక్కువ ఖర్చుల కారణంగా నష్టాలు రావడంతో మూసివేశారు. 2015లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గనుల తవ్వకాలు తెరపైకి వచ్చాయి. అయితే రామగిరి గోల్డ్ ఫీల్డ్స్లో వందల ఏళ్ల పాటు తవ్వినా తరిగిపోని బంగారు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. తాజాగా కేంద్రం మైనింగ్కు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి