Superstar Krishna: ఆయనే మన జేమ్స్బాండ్.. కృష్ణ మృతిపై తెలుగు సీఎంల సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu States CM YS Jagan Mohan Reddy KCR Pay Tributes To Krishna Demise: సూపర్స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్నుమూశారు. ఈయన మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు.
‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం.. తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ మాధ్యమంగా సంతాపం తెలియజేశారు. వైఎస్ కుటుంబానికి ఘట్టమనేని కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే! రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణ.. ఆయన మరణించిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక.. కృష్ణ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కృష్ణ సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచే వైఎస్ కుటుంబంతో కృష్టకి గట్టి బాండింగ్ ఏర్పడింది.
Also Read
- AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
- Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- CM Chandrababu Convoy: ప్రధాని మోడీ పిలుపు.. కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు!
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా.. ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. అటు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, గవర్నర్ తమిళిసై కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?