బద్వేల్ బై పోల్.. టీడీపీ స్పెషల్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణియే.. డాక్టర్ సుధా.. ప్రస్తుతం కడపలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారామె.. ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో.. ఆయన సతీమణి సుధాకు టికెట్ ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల్లో అభ్యర్థిగా పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆమె.. ఇంటింటి పరిచయ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా బద్వేల్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తాజాగా వెలువడిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఆ నియోజకవర్గం పరిధిలో పర్వాలేదు అనిపించింది టీడీపీ.. దీంతో.. బద్వేల్ ఉప ఎన్నికల్లో విజయం ఏమో కానీ.. గట్టి పోటీ ఇవ్వగలం అనే ధీమాతో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు.. త్వరలోనే ఆ నియోజకవర్గ నేతలతో సమవేశం కానున్నారు పార్టీ అధినేత చంద్రబాబు.. ఉప ఎన్నికల కోసం ఇంఛార్జ్లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. కాగా, బద్వేల్ నియోజకవర్గంలోనే ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఓ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకుంది టీడీపీ.. పార్టీ అధినాయకత్వం ఎన్నికలను బహిష్కరించినా.. స్థానిక నేతలు గట్టిగా ప్రయత్నాలు చేసి.. మంచి ఫలితాలను సాధించారు.. దీంతో.. బై పోల్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాఉ.. ఫోకస్ పెడితే అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే లెక్కలు వేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ని బద్వేల్ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!