Palla Srinivasa: వైసీపీకి వార్నింగ్.. దౌర్జన్యం చేస్తే, రౌడీల్లా వ్యవహరిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Srinivasa Warning To YCP: టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ అధికార పార్టీ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ దౌర్జన్యం చేస్తే.. తాము కూడా రౌడీల్లా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. దసపల్లా భూములు, హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే తమ అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును కూల్చేశారని మండిపడ్డ పల్లా శ్రీనివాస్.. ఆ కొండకి సమీపంలో విజయసాయి, జగన్ రాడిసన్ బ్లూ, బే పార్క్ రిసార్ట్స్ కట్టుకున్నారని అన్నారు. తమ రిసార్ట్స్కు వ్యాపారం పెంచుకోవడం కోసమే ప్రభుత్వ రిసార్ట్స్ను కూల్చారని.. రాజధాని కోసం కాదన్నారు. సీఎం సతీమణికి అక్కడ వ్యూ నచ్చడం వల్ల, అక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని ఏదేదో చెప్తూ.. ఋషికొండను బోడి కొండ చేశారన్నారు. సీఎం ఇల్లు కట్టుకోవాలంటే.. 80 అడుగుల మీదున్న కొండే కావాలా..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో పులివెందుల పంచాయతీ కుదరదని.. ఉత్తరాంధ్ర విప్లవ పోరుగడ్డ అని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఇదిలావుండగా.. వికేంద్రీకరణకు మద్దతు ఇస్తూ, శనివారం జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జేఏసీ నాయకులు సహా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. మూడు రాజధానుల నినాదం మారుమోగుతున్న ఈ ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనల్ని సైతం నిర్వహించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!