NTV Telugu Site icon

TDP Mahanadu : ఎన్టీఆర్‌ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం..

Ntr

Ntr

అమెరికాలోని బోస్టన్‌లో టీడీపీ మ‌హానాడు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే. ఈ నేపథ్యంలో అమెరికాలోని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహంపై హెలికాప్ట‌ర్ నుంచి టీడీపీ అభిమానులు పూలవ‌ర్షం కురిపించారు. టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఈ విష‌యాన్ని తెలుపుతూ వీడియో పోస్ట్ చేశారు. ఈ మ‌హానాడులో ఆయ‌న కూడా పాల్గొన్నారు.

‘అమెరికాలోని బోస్టన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో, హెలికాప్టర్లో అన్న గారి విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది’ అని గోరంట్ల తెలిపారు.
ఈ సంబరాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి శాసనమండలి సభ్యుడు మంతెన సత్యనారాయణ రాజు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నన్నూరి నర్సి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.