కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అక్రమ అరెస్టులు చేసి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగిందని ఒప్పుకుంటే తెదేపా నాయకులు తమ కమిటీని తీసుకుంటాం. అందులో లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ఉండి నిజాలను వెలికితీస్తే వైసీపీకి ఎందుకు కోపం/ ఆంధ్రప్రదేశ్ లో మద్యం, మైనింగ్ విధానాలలో జగన్ జేబులు నింపుతున్నాయి. మద్యం విక్రయిస్తే జే టాక్స్ రూపంలో వాళ్ళ జేబులు నింపుతున్నాయి. కొండల నుంచి గుట్టల వరకు అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం అనే విధానాన్ని పాటిస్తున్నారు. ఈ విధానం మంచి పద్ధతి కాదు పోరాటాన్ని కొనసాగిస్తాము. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగే అక్రమ మైనింగ్ పై తమ పోరాటం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
