NTV Telugu Site icon

పెట్రో మంట : 9న ఏపీలో టీడీపీ ఆందోళనలు..

పెట్రోల్, డీజిల్‌ పై కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా పెట్రోల్‌, డీజిల్‌ పై రాష్ట్ర వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఈ నెల 9 ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కంటే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు. నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.