NTV Telugu Site icon

Surya Prakash Reddy : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లాలోని ఆలూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యే లు దౌర్జనానికి పాలుపడుతున్నారని ఆయన అన్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ జరిగినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోరని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రెండునరేళ్ళలో అన్ని వర్గాల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో రోజురోజుకు అవినీతి పాలన పెరిగిపోతోందని, వాస్తవాలు మాట్లాడినవారిపై దాడులు చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నష్టం జగన్‌ ప్రభుత్వం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు.