Minister Narayana: గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి.. కోట్లు అప్పు మిగిల్చింది!
- గత ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది..
- వైసీపీ సర్కార్ ఖజానా ఖాళీ చేసి.. కోట్ల అప్పు మిగిల్చింది..
- చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడుతున్నాయి: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం.. కానీ, గత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళింది అని మండిపడ్డారు. ఇక, ప్రజా మద్దతుతో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: Irfan Pathan: “నేను దీన్ని సమర్థించను”.. ధోని బ్యాటింగ్ ఆర్డర్పై ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్..
Also Read
ఇక, రాష్ట్ర ప్రజలకు సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఆగిపోయాయి.. ఈ పనులను వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తాం.. అలాగే, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్లు మంచి నీటిని ఇచ్చే పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్డర్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే.. వాటిని కూడా జగన్ సర్కార్ నిరుపయోగం చేసింది.. వాటినీ తిరిగి ఉపయోగంలోకి తీసుకోస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.