Kakarla Suresh: టీడీపీ-జనసేన-బీజేపీల కలయిక చారిత్రాత్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో తెలుగుదేశం జనసేన టీడీపీల కలయిక చారిత్రాత్మకమైనదని.. మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా నడిచి విజయం సాధిద్దామని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. వింజమూరు మండల కేంద్రం బొమ్మరాజు చెరువు తెలుగుదేశం కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో దుష్ట శక్తిని సాగనంపాలంటే అందరి కలయిక ముఖ్యమని ఒక అడుగు ముందుకేసి అనుభవం ఉన్న నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు అందరితో సయోధ్య కుదిర్చి పొత్తు పెట్టుకోవడం శుభ పరిణామం అన్నారు.
తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలను స్వాగతిస్తున్నట్లు కాకర్ల సురేష్ తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలన తుది ముట్టించేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని.. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. అన్ని వర్గాల పై దాడులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన విషయాన్ని బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చెప్పిన మాటల్లోనే అర్థమవుతుందన్నారు.
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిదని.. దీనికి నిదర్శనం మొన్న జరిగిన జయహో బీసీ సభ రుజువు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారిందన్నారు. తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి మహా యజ్ఞంగా మూడు పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. గతంలో ఇంత అరాచక పాలన చూడలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్షిణికపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణగా ఉంటుందని.. అతిపెద్ద జాతీయ పార్టీ మద్దతు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. అందుచేత అందరం కలిసికట్టుగా పనిచేసే విజయం సాధిద్దామని కాకర్ల పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉదయగిరి అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!