South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈనెల 13న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07412) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
అటు ఈనెల 14న హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు హైదరాబాద్లో శుక్రవారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి.. ఆదివారం ఉదయం 6:30 గంటలకు గోరఖ్పూర్ చేరుతుంది. ఈనెల 16న గోరఖ్పూర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు గోరఖ్పూర్లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బలర్షా, నాగ్ పూర్, భోపాల్, బినా, కాన్ పూర్, లక్నో స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అటు ఈనెల 15న బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈనెల 12న బెంగళూరు-జోధ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:15 గంటలకు జోధ్పూర్ చేరుతుంది.

తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!