South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈనెల 13న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07412) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
Also Read
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
అటు ఈనెల 14న హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు హైదరాబాద్లో శుక్రవారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి.. ఆదివారం ఉదయం 6:30 గంటలకు గోరఖ్పూర్ చేరుతుంది. ఈనెల 16న గోరఖ్పూర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు గోరఖ్పూర్లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బలర్షా, నాగ్ పూర్, భోపాల్, బినా, కాన్ పూర్, లక్నో స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అటు ఈనెల 15న బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈనెల 12న బెంగళూరు-జోధ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:15 గంటలకు జోధ్పూర్ చేరుతుంది.

తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..