South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈనెల 13న తిరుపతి-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07412) ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 5:15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5:55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
అటు ఈనెల 14న హైదరాబాద్-గోరఖ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు హైదరాబాద్లో శుక్రవారం రాత్రి 9:05 గంటలకు బయలుదేరి.. ఆదివారం ఉదయం 6:30 గంటలకు గోరఖ్పూర్ చేరుతుంది. ఈనెల 16న గోరఖ్పూర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు గోరఖ్పూర్లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు బయలుదేరి.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బలర్షా, నాగ్ పూర్, భోపాల్, బినా, కాన్ పూర్, లక్నో స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. అటు ఈనెల 15న బెంగళూరు-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు బెంగళూరులో మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుతుంది. ఈనెల 12న బెంగళూరు-జోధ్పూర్ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు బెంగళూరులో ఉదయం 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:15 గంటలకు జోధ్పూర్ చేరుతుంది.

తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!