క్లియర్ అజెండా.. ఎవరి రాజకీయం వారిది.. అమ్మ ఒక్కరే సెంటర్ పాయింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్ నుంచి చాలా కాలం క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వెనకాల జగన్ ఉన్నారని.. ముందుకు ఆయనే నడిపిస్తున్నారని కొందరు అన్నారు. కానీ.. ఇప్పటివరకూ.. ఒక్కటంటే ఒక్క మాట కూడా.. షర్మిల గురించి జగన్ మాట్లాడనేలేదు.
కేవలం విజయమ్మ మాత్రమే.. తన కుమార్తె గురించి ఆమె సభలకు వెళ్లారు. ప్రసంగించారు. వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని చాటారు. వైఎస్ బాటలో షర్మిల నడుస్తుందని చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న నేతలను షర్మిలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న జనాలు.. ఇప్పుడిప్పుడే ఓ స్పష్టతకు వస్తున్నారు. జగన్ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టే అవకాశం లేదు. షర్మిల రాజకీయ బాటలో.. జగన్ కలగజేసుకునే అవకాశం అంతకన్నా లేదు.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
కానీ.. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి అయ్యే వరకూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఎలా ముందుండి నడిపించారో.. తన కుమార్తె షర్మిల బాధ్యతనూ.. అలాగే ముందుకు తీసుకుపోతున్నారన్నది అంతా గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో షర్మిల ఏ స్థాయికి చేరుకుంటారన్నది.. తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉన్న అంశం. కానీ.. ఇప్పుడు కాకపోతే.. తర్వాత అయినా సరే.. విజయమ్మ చూపిన బాటలో షర్మిల.. తన సోదరుడిలా ఉన్నత స్థానానికి చేరుకుంటారని.. ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే.. బంధుత్వానికి మాత్రమే జగన్, షర్మిల సొంత అన్నాచెల్లెళ్లనీ.. రాజకీయాల్లో మాత్రం వారిది ఎవరి బాట వారిదే అని.. తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ వేదికగా జరిగిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి జగన్ రాకపోవడం కూడా.. ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!