క్లియర్ అజెండా.. ఎవరి రాజకీయం వారిది.. అమ్మ ఒక్కరే సెంటర్ పాయింట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్ నుంచి చాలా కాలం క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వెనకాల జగన్ ఉన్నారని.. ముందుకు ఆయనే నడిపిస్తున్నారని కొందరు అన్నారు. కానీ.. ఇప్పటివరకూ.. ఒక్కటంటే ఒక్క మాట కూడా.. షర్మిల గురించి జగన్ మాట్లాడనేలేదు.
కేవలం విజయమ్మ మాత్రమే.. తన కుమార్తె గురించి ఆమె సభలకు వెళ్లారు. ప్రసంగించారు. వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని చాటారు. వైఎస్ బాటలో షర్మిల నడుస్తుందని చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న నేతలను షర్మిలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న జనాలు.. ఇప్పుడిప్పుడే ఓ స్పష్టతకు వస్తున్నారు. జగన్ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టే అవకాశం లేదు. షర్మిల రాజకీయ బాటలో.. జగన్ కలగజేసుకునే అవకాశం అంతకన్నా లేదు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
కానీ.. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి అయ్యే వరకూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఎలా ముందుండి నడిపించారో.. తన కుమార్తె షర్మిల బాధ్యతనూ.. అలాగే ముందుకు తీసుకుపోతున్నారన్నది అంతా గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో షర్మిల ఏ స్థాయికి చేరుకుంటారన్నది.. తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉన్న అంశం. కానీ.. ఇప్పుడు కాకపోతే.. తర్వాత అయినా సరే.. విజయమ్మ చూపిన బాటలో షర్మిల.. తన సోదరుడిలా ఉన్నత స్థానానికి చేరుకుంటారని.. ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే.. బంధుత్వానికి మాత్రమే జగన్, షర్మిల సొంత అన్నాచెల్లెళ్లనీ.. రాజకీయాల్లో మాత్రం వారిది ఎవరి బాట వారిదే అని.. తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ వేదికగా జరిగిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి జగన్ రాకపోవడం కూడా.. ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!