Somu Veerraju on Amaravati: అమరావతే ఏపీకి ఏకైక రాజధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం.
రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే స్థాయిలో మోడీ ఉండటం గర్వకారణం. ఏపీ విద్యార్థులు అనేక మంది వివిధ దేశాలలో చదువుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాల వారు మన దేశం వచ్చి చదువుకునే రోజులు వస్తాయి. ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను తెచ్చేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుంది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
జగనన్న పేరుతో కట్టే ఇళ్లకు మోడీ రూ. 32 వేల కోట్లు ఇస్తున్నారు.ఆ ఇళ్లకు స్థలం ఇచ్చామనే సాకుతో జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.నరేగా కింద చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు ఇచ్చాం. జగన్ అధికారంలోకి వచ్చాక రూ. 37 వేల కోట్లు నిధులు నరేగా కింద కేటాయించారు.ఏపీ అభివృద్ధిని అన్ని విధాల కేంద్రం సహకరిస్తుంది.నితిన్ గడ్కరీ రూ. 3 లక్షల కోట్లు ఏపీకిచ్చారన్నారు సోము వీర్రాజు.
అంతా తానే చేసినట్టు జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధాని.. ఇందులో సందేహం లేదు.అందుకే అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకు కేంద్రం వేల కోట్లు కేటాయించారు.భూములిచ్చిన రైతులకు లే అవుట్ వేసి ఇచ్చి ఉండాల్సింది.చంద్రబాబు ఆనాడు ఈ పని చేసి ఉంటే.. నేడు ఈ రాజధాని వివాదం వచ్చేదే కాదు. అనేక రాష్ట్రాల్లో సైలెంటుగా రాజధానులు నిర్మించుకున్నారు. ఇక్కడ గత, ప్రస్తుత పాలకుల చేతగానితనం కారణంగా రాజధాని వివాదం నెలకొంది.అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకరించినా ఒక్కరూ చెప్పడం లేదన్నారు.
లగడపాటి రాజగోపాల్ పదేళ్లు ఎంపీగా ఉన్నా ఒక్క ఫ్లైఓవర్ నిర్మించ లేదు. మోడీ సారధ్యంలోని కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అమరావతిలో బొక్కేసాడని బుక్కేశాడు జగన్. ఇప్పుడు ఆ రూ.55వేల కోట్లు ఈయనకి ఇస్తే ఈ సీఎం బొక్కేస్తాడన్నారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!