Somu Veerraju: జగన్ది దశ, దిశలేని ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు.
వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా అమలవుతున్న శక్తి కేంద్రం. మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించాలి. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించి జగన్ కూడా తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. 14, 15వ ఆర్దిక సంఘం నుంచి గ్రామాల అభివృద్ధికి మోడీ నిధులు కేటాయించారు.
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
సర్పంచుల ఆధారంగా నిధులు ఇస్తున్న శక్తి నరేంద్ర మోడీ. ప్రజలకు ఇచ్చే రూ. 1 కిలో బియ్యం ఖర్చు కేంద్రానిదే. ఇంకా మధ్యాహ్న భోజన పధకం, స్కూల్ యూనిఫాం, పాఠశాలలు అభివృద్ధికి మోడీ నిధులిచ్చారు. జగన్ నవరత్నాలిస్తే… మోడీ డజన్ల కొద్దీ రత్నాలు ఇచ్చారు. జగన్ పధకాలకు అప్పులు చేసి.. అప్పులు పుట్టని పరిస్థితికి వచ్చారు. మూడు వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేస్తామని కేంద్రం చెప్పింది. రైల్వేకు రూ. 64 వేల కోట్లు కేటాయించారు. జగన్ మాత్రం కాగ్ రిపోర్టులకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. బీజేపీకి ఓట్లు పడవన్న మంత్రి వెల్లంపల్లి చర్చకు రావాలి.
ఎవరు ఎన్నెన్ని నిధులిచ్చారో బహిరంగంగా చర్చిద్దాం. మోడీకి ఓటేయాలని వెల్లంపల్లితోనే చెప్పిస్తాం. ఏపీలో బీజేపీ రాజకీయం చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తే బీజేపీ నిలదీస్తుందన్నారు. రాజధానిని కట్టలేని చేతకాని ప్రభుత్వం. అమరావతిని చంపేద్దామని కుట్రలు చేస్తున్నారు. మీరు కేపిటల్ కట్టకున్నా.. బీజేపీ రహదారుల అభివృద్ధి, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేశాం. యూనివర్శిటీలు, ఆసుపత్రులు కట్టి విద్యార్ధులకు, పేదలకు సేవలు అందించాం. అమరావతి నుంచి అనంతపురం వరకు రూ. 10 వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ రహదారిని నిర్మిస్తున్నాం.
రాజకీయ నాయకుల్లారా మాయ మాటలు, కాకమ్మ కబుర్లు మానేయండి. బీదేపీ మంత్రం అభివృద్ధి.. నాలుగు రాష్ట్రాల్లో అదే మా గెలుపు తంత్రం. ఏపీకి చంద్రబాబు హయాంలో రూ. 35 వేల కోట్లు, వైసీపీ హయాంలో రూ. 36 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. నరేగా కింద నిధులు ఇచ్చే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఎందుకు ఇవ్వం. ఇక నుంచి బీజేపీపై కూతలు, కోతలు కూయలేరు. శక్తి కేంద్రం ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేలా అందరూ అడుగులు వేయాలన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!