Site icon NTV Telugu

ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ‘సిరివెన్నెల’ కుటుంబం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 24వ తేదీ కిమ్స్ హాస్పిటల్ లో చేరిన ‘సిరివెన్నెల’ సీతా రామశాస్త్రి నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారు. అయితే ఈ సమయంలో హాస్పిటల్ లో వైద్యానికి అయిన ఖర్చులన్నంటినీ ఏపీ ప్రభుత్వం భరిస్తుందని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిగారికి ‘సిరివెన్నెల’ కుటుంబం కృతజ్ఞతాభివందనాలు మనస్పూర్తిగా తెలియజేస్తోంది. 30/11/2021 ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారి కార్యాలయం నుండి శాస్త్రి గారి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్ని ప్రభుత్వం భరిస్తుందని, శ్రీ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఆదేశించినట్లుగా తెలిసింది. శ్రీ సిరివెన్నెల నవంబర్ 30వ తేదీ సాయంత్రం 4.07 గంటలకు స్వర్గస్తులైనారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తమ సంతాపాన్ని తెలియజేశారు. శాస్త్రిగారి అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలియజేశారు.

సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్‌మోహన్ రెడ్డిగారికి మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది అని పేర్కొన్నారు.

Exit mobile version