RTC@90 Years: ఆర్టీసీకి 90 వసంతాలు. అలుపెరుగని రథచక్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) తన అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నిజాం కాలంలో పురుడు పోసుకున్న ఈ ప్రగతి రథచక్రానికి ఇవాళ్టితో 90 ఏళ్ళు పూర్తయ్యాయి. జూన్ 15, 1932లో ఆర్టీసీ ఏర్పాటయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) టీఎస్ఆర్టీసీ (TSRTC) గా రూపాంతరం చెందింది. ఈ రథచక్రాలు పరుగులు పెట్టడం మొదలై నేటికి 90 వసంతాలవుతోంది. ఇప్పటికీ అలుపు, సొలుపు లేకుండా.. ఆర్టీసీ ప్రయాణమంటేనే సురక్షితం, సుఖవంతం అనే నినాదం వుంది.
నిజాంల కాలంలో 15, జూన్ 1932లో నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (NSRRTD) గా ఏర్పాటయింది. అప్పుడు కేవలం 27 బస్సులు, 166 మంది ఉద్యోగులు వున్నారు. తర్వాత 1958 లో APSRTC ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తదుపరి 2014లో TSRTC ఏర్పాటైంది. ఈ రెండు కార్పోరేషన్లలో వేలాదిమంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
Also Read
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
- CM Chandrababu Markapuram Tour: రూ.300 కోట్ల పరిహారం పంపిణీకి సీఎం.. మార్కాపురం జిల్లాలో నేడు విస్తృత పర్యటన
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకూ రోజూ లక్షలాదిమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూంటారు. సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమంటే అదే ఆర్టీసీకే సాధ్యం అంటారు ప్రయాణికులు. పేదల పుష్పక విమానంగా పేరుగాంచిన ఎర్రబస్సు.. ప్రైవేట్ వాహనాలకు దీటుగా ఆధునిక హంగులనూ సమకూర్చుకుంటోంది. సరకు రవాణాలోనూ సత్తా చాటుతోంది. ప్రైవేట్ కొరియర్ సంస్థలకు పోటీగా సరుకు రవాణా చేస్తోంది. కోవిడ్ టైంలోనూ సేవలు అందించింది. అయితే, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడింది. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ విభాగంలో సమూల మార్పులు చేయడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫోకస్ పెట్టారు. రైల్వేతో కలిసి సరుకు రవాణాలో ముందుకెళ్లాలని, తద్వారా వేగవంతమయిన సేవలు అందించాలని భావిస్తోంది ఆర్టీసీ. పార్శిల్స్ బుక్ చేసుకున్న వారి ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్దకు ఆర్టీసీ కార్గో సిబ్బంది వెళ్లి సరుకును తీసుకువచ్చి..అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తారు. దీనివల్ల వినియోగదారులను మరింత చేరుకునే అవకాశం కలుగుతుంది.

Rtc90
విద్యార్ధులు పోటీ పరీక్షలకు, పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లలో పసిపిల్లలు తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ప్రత్యేకంగా బాక్సులు అందుబాటులో వుంచారు. ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చాయి. కానీ ఛార్జీల భారం ఎక్కువగా వుందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ రేట్ల పెంపువల్ల ఛార్జీల భారం మోయక తప్పదంటున్నారు అధికారులు.
బుల్లి గౌను వేసుకున్న బొద్దు భామ..
- Tags
- 1932
- andhra
- apsrtc
- june-15
- Nizam time
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!