RK Roja: పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు పుట్టలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే ఏపీ మంత్రులు మాత్రం ఈ ఎన్నికలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 108 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్నే గెలిపించారు అని చంద్రబాబు అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మాదే హవా అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అదే నిజం అయితే..నా సవాలును స్వీకరించాలన్నారు మంత్రి ఆర్ కె రోజా. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ , చంద్రబాబు తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి చూపించాలి. చనిపోయే ముందు నోట్లో తీర్థం పోసినట్లు పూర్తిగా ఓడిపోయే టీడీపీకి గ్రాడ్యుయేట్లు తీర్థం పోశారు.
తీర్థం పోస్తే పోయే వాళ్ళు ప్రశాంతంగా వెళతారని నమ్మకం వుంది. పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు.వై నాట్ పులివెందుల అని నాగబాబు అనటం పెద్ద జోక్. సొంత గడ్డ పైనే అన్నదమ్ములు నాగబాబు , పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఓడిపోయారు…మొదటి సారి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేశాం. ఈ ఎన్నిక విధానం వేరు. ఇప్పుడు వచ్చిన అనుభవంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. టిడిపి మూడింటి గెలుపుని చూసి జబ్బలు కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టిడిపిని లాక్కున్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
Read Also:Pawan Kalyan: ఏపీ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు
ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్సార్ సిపి…వైఎస్ జగన్ తన కష్టంతో పార్టీ స్ధాపించారు. కుళ్లు కుతంత్రాలతో గెలిచే వ్యక్తి చంద్రబాబు. ఈ గెలుపు చూసి జబ్బలు చురుచుకోవద్దు. నంద్యాల ఎన్నికలు చూసి విర్రవీగిపోయారు. ఆ తర్చాత మాకు పట్టంకట్టారు. ఈ ఎన్నికలలో మూడు గెలిచి విర్రవీగవద్దు..వచ్చే ఎన్నికలలో మళ్లీ మేమే గెలుస్తాం. సంక్షేమ పధకాలని చూసి మళ్లీ ప్రజలు మాకు పట్టం కడతారు. వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు గెలిచి తీరతాం. చంద్రబాబు వయసు అయిపోయింది…ఆయన పని అయిపోయింది. మేము గెలిస్తే అక్రమాలా…వారు గెలిస్తే ప్రజాస్వామ్యంలో గెలిచినట్టా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!