Road Accidents: ఏపీలో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 10 నెలల్లో 5,831 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రాష్ట్రంలోనే కాదు.. దేశ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. దానికి ప్రధాన కారణం, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలతో పాటు.. కఠినమైన రూల్స్ కారణంగా.. ప్రజలు తక్కువ సంఖ్యలో బయటకు రావడమే.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత.. క్రమంగా రోడ్డు ప్రమాదాలు.. ఆ ప్రమాదాల్లో మృత్యువాత పడేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ పోతోంది.. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆ తర్వాత.. మళ్లీ టూర్లు, ట్రిప్పులకు వెళ్తున్నారు.. రోడ్లపై రద్దీ కూడా పెరిగిపోయింది.. దీంతో, ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి.
Read Also: Love Today Movie Review: లవ్ టుడే రివ్యూ (తమిళ డబ్బింగ్)
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఈ ఏడాది బారీగా పెరుగుదల నమోదైంది.. ఈ ఏడాదిలో 9.95 శాతం మేర రోడ్డు ప్రమాదాలు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. 2022 జనవరి నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,314 రోడ్డు ప్రమాదాలు జరగగా.. గత పది నెలల కాలంలో జరిగిన రోడ్ ప్రమాదాల్లో ఏకంగా 5,831 మంది మృతిచెందారు.. గతేడాదితో పోలిస్తే 6.56 శాతం మేర పెరిగిపోయింది మృతుల సంఖ్య.. ఈ ఏడాది లారీలు, ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.. తాజాగా విలీనమండలం చింతూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషయం విదితమే కాగా.. రాష్ట్రంలోని రోడ్లపై 1200కు పైగా బ్లాక్ స్పాట్లను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.. విపక్ష నేతలు, పక్క రాష్ట్రాల మంత్రులు, స్వామీజీలు కూడా ఏపీ రోడ్లపై స్పందించిన సందర్భాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!