Site icon NTV Telugu

Rathasapthami 2023: భక్తులకు అలర్ట్.. తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు.. ఈ సేవలన్నీ రద్దు..

Ttd

Ttd

Rathasapthami 2023: తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.. రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకేరోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం, ఉదయం 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు..

Read Also: Astrology : జనవరి 27, శుక్రవారం దినఫలాలు

ఇక, రేపు రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం భక్తులుకు జారీచేసే టోకెన్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఇవాళ, రేపు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపును కూడా రద్దు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. మరోవైపు.. ఇవాళ టీటీడీ మొబైల్‌ యాప్‌ని విడుదల చేయనున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ మొబైల్ యాప్ ద్వారా టీటీడీకి సంబంధించిన సమగ్ర సమాచారం భక్తులకు ఈ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకున్నారు.. 28,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు లభించింది.

Exit mobile version