Krishna River Water Flow: కృష్ణానదికి వరద ఉధృతి.. బీ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వర్షాలు పడుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రాత్రి లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం వుందని విపత్తుల సంస్థ ఎండీ డా. బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులుగా వుంది. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా అధికారుల అలెర్ట్ అయ్యారు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో … 3లక్షల 30వేల 738 క్యూసెక్కులుగా వుంది. 14గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
వరద పెరిగే కొద్ది ముంపు గురికాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ఇటు నాగార్జున సాగర్ కు కూడా వరద ప్రవాహం పెరిగింది. ఎడమకాలువకు గండి పడింది. శ్రీశైల జలాశయానికి భారీగా పెరుగుతున్న వరదతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలం జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇన్ ఫ్లో : 3,50,341 క్యూసెక్కులుగా వుండగా.. ఔట్ ఫ్లో : 3,14,293 క్యూసెక్కులుగా వుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా వుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కర్నూలు జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు నగరంతోపాటు నంద్యాల, మిడుతూరు లో భారీ వర్షం కురిసింది.
ఆలూరు, ఆత్మకూరు, పత్తికొండ,నందికొట్కూరు,జూపాడుబంగ్లా, పగిడ్యాల, డోన్ ప్రాంతాల్లో తేలికపాటి, ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి ఆలూరు లో మట్టి మిద్దెకూలి ఇంద్రమ్మ(30) అనే మహిళ మృతి చెందగా కూతురు పరిస్థితి విషమంగా ఉంది. బాలికను ఆదోని ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. హోళగుంద మండలం మార్లమడికి సమీపంలో వేదవతి నది పొంగి ఆంధ్ర, కర్ణాటక రాకపోకలకు అంతరాయం కలిగింది.
Read Also: Nagarjuna sagar Left Canal: సాగర్ ఎడమకాలువకు గండి.. భారీగా పంట నష్టం
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!