PVN Madhav: స్మార్ట్ గా దోచేశారు.. తిరిగిచ్చెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. దీంతో ప్రభుత్వం తన తప్పు తెలుసుకుంది. స్మార్ట్ సిటీ ఛైర్మన్ల పదవులకు గండం ఏర్పడింది. ఈ నియామకాల్లో న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. దీంతో స్మార్ట్ సిటీ ఛైర్మన్ల వరుస రాజీనామాలకు తెరతీసింది ప్రభుత్వం. జీవీఎంసీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ రాజీనామా చేశారు.
సాంకేతికంగా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్లు నియామకాలు చెల్లవని ఆలస్యంగా గుర్తించింది రాష్ట్రప్రభుత్వం. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల ఛైర్మన్లు రాజీనామా చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విశాఖ, తిరుపతి, కాకినాడ, ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ల రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. స్మార్ట్ సిటీ కార్పోరేషన్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. కాకినాడలో మోడరనైజేషన్ పేరుతో భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ఉపనదుల్లో డ్రెడ్జింగ్ పేరిట లెక్కా పత్రం లేకుండా నిధులు వినియోగించారు. రాజకీయ పునరావాసం కోసమే కులాల పేరిట కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
స్మార్ట్ సిటీల ఛైర్మన్ నియామకాలు చెల్లవని ప్రభుత్వానికి ఇప్పటికి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెంప పెట్టు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. తప్పు తెలుసుకుని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సీఎం రాజీనామా చేయించారు. టీటీడీ బోర్డును సైతం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనాలు దొరకని పరిస్థితి నెలకొంది. టీటీడీ నిబంధనల ప్రకారమే సభ్యులను నియమించాలి.
ప్రత్యేక ఆహ్వానితుల ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం లాక్కుంది. ప్రభుత్వం తీసుకున్న ఆస్తులు తక్షణమే వెనక్కి ఇచ్చేయాలి. సీపీఎస్ పై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదు. ప్రభుత్వానికి ధైర్యముంటే సీపీఎస్ రద్దు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!