Markapuram Bus Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం..
- మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- రాయవరం దగ్గర టిప్పర్ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ..
- ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం.. 10 మంది సజీవ దహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Markapuram Bus Accident: ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది సజీవదహనం అయినట్టుగా సమాచారం.. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీ వద్ద ప్రైవేట్ హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు టిప్పర్ను ఢీకొనడంతో ఈ విషాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
Read Also: Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..
Also Read
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం.. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికుల వరకు ఉన్నట్టుగా తెలుస్తుండగా.. 10 మంది ఇప్పటికే సజీవదహనం అయినట్టుగా భావిస్తున్నారు.. ఇక, ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైనవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. అయితే, ఇందులో ఎవరి పరిస్థితి ఎలా ఉంది..? అని పూర్తి సమాచారం అందుతుండగా.. ప్రమాద తీవ్రతను చూస్తే మాత్రం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.. ఈ బస్సు జగిత్యాల నుంచి కనిగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకొన్న వెంటనే మంటలు ఎలా చెలరేగాయి అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
-
Lavanya : అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు!
-
MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
-
RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!